గాలి ద్వారా కరోనా.. ఇలా చెక్ పెట్టవచ్చు..

  • IndiaGlitz, [Thursday,May 20 2021]

గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎలా చెక్ పెట్టాలో తాజాగా నిపుణులు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం వైరస్ వ్యాప్తి కట్టడికి నూతన అడ్వైజరీ విడుదల చేసింది. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలంటే తప్పనిసరిగా ఇంట్లో గాలి వెలుతురు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇండోర్‌లలో వెంటిలేషన్ పెంచుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని శాస్త్రీయ సలహా బృందం సూచించింది.

Also Read: కరోనా సెకండ్ వేవ్ అంతం ఎప్పుడంటే...

కరోనా సోకిన వ్యక్తి నుంచి కుటుంబంలోని ఇతరులకు సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుందని తెలిపారు. ఎగ్జాస్ట్ సిస్టమ్స్ స్థానంలో ఫ్యాన్‌ను అమరిస్తే వైరస్ సైతం బయటకు పోతుందని వెల్లడించారు. కొవిడ్ బాధితుడు మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం, నవ్వడం వంటివి చేసినప్పుడు బయటకు వచ్చే వైరస్ కణాల్లో రెండు రకాలుంటాయి. పెద్ద పెద్ద డ్రాప్‌లెట్స్, చిన్న చిన్న డ్రాపులెట్స్. పెద్ద వాటితో పోలిస్తే చిన్నవే ప్రమాదకరం. పెద్ద పెద్ద డ్రాపులెట్స్ నేరుగా భూ ఉపరితలంపై పడతాయి. వాటిని తాకిన చేతులతో ముఖం, నోటిని తాకితే ప్రమాదం.

అయితే చిన్న చిన్న డ్రాప్‌లెస్ గాలిలో దాదాపు 10 మీటర్ల వరకూ ప్రయాణిస్తాయి. వీటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో వెంటిలేషన్ మంచిగా ఉండేలా చూసుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే డబుల్ మాస్క్‌ను ధరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందట. డబుల్ మాస్క్‌ను ధరించినప్పుడు క్లాత్ మాస్క్‌తో పాటు సర్జికల్ మాస్క్‌ను తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా సర్జికల్ మాస్క‌ును క్లాత్ మాస్కుతో కలిపి వినియోగించినప్పుడు ఐదు సార్ల వరకూ వినియోగించవచ్చని.. అయితే దానిని వినియోగించి తొలగించిన వెంటనే ఎండలో ఆరబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

More News

కరోనా సెకండ్ వేవ్ అంతం ఎప్పుడంటే...

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి దాదాపు ఏడాది పాటు పట్టి పీడించింది. కరోనా మహమ్మారి ఇక అంతమైనట్టే అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ ప్రారంభమై..

RRR: కొమరం భీం గురిపెడితే గుండెల్లో దిగాల్సిందే

జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొమరం భీం లుక్ విడుదల చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న లుక్ విడుదల

సమంత సిరీస్‌కు తమిళుల సెగ

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రయిలర్‌పై తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళులకు వ్యతిరేకంగా సిరీస్ తీశారని తిట్టిపోస్తున్నారు.

భాయ్ ని నమ్ముకుంటే 'జీ'కి దెబ్బ పడిందా?

సల్మాన్ ఖాన్, దిశా పటాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ రాధే. ప్రభుదేవా దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

పిక్ టాక్: నెట్టింట కాక రేపుతున్న మనోజ్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ గుర్తుందా.. ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం 'నేను మీకు తెలుసా'. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ మూవీలో రియా సేన్ హీరోయిన్.