కరోనా అంతమైందంటూ పార్టీ.. వేలల్లో హాజరైన ప్రజలు

  • IndiaGlitz, [Friday,July 03 2020]

కరోనా కారణంగా ప్రపంచమే వణికిపోతుంటే.. ఓ దేశంలో మాత్రం ‘కరోనా వైరస్ పార్టీ’ పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం జరిగింది. ఈ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ వింత పోకడకు ప్రేగ్ కేంద్రంగా నిలిచింది. విషయం తెలుసుకుని ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. సీజెక్ రిపబ్లిక్ దేశంలో లాక్‌డౌన్ నిబంధనలను తొలగించారు.

నిబంధనలు తొలగించి నెలరోజులు దాటుతున్న నేపథ్యంలో ప్రేగ్‌లో కరోనా వైరస్ ఫేరెవెల్ పార్టీ ఓ భారీ బహిరంగ కార్యక్రమం జరిగింది. దీనికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నవ్విపోదురుగాక అని ఎవరనుకున్నా.. నిస్సిగ్గుగా ఈ పార్టీ జరిగిపోయింది. ప్రేగ్‌లోని ఓ కెఫే యజమాని అయిన ఓంద్రేజ్ కోబ్జా ఈ పార్టీని ప్రఖ్యాత చార్లెస్ బ్రిడ్జిపై నిర్వహించారు. అతిథుల కోసం ఏకంగా 500 మీటర్ల పొడవైన టేబుల్ వేశాడు. ఈ టేబుల్ పట్టనంత మంది జనం ఈ పార్టీకి హాజరవడం విశేషం. ఇదేమని కోబ్జాను అడిగితే.. కరోనా మహమ్మారి అంతమైందని అందుకే ఈ వేడుక నిర్వహించానని చెప్పుకొచ్చాడు.

More News

లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన

చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైన్యంలో ధైర్యాన్ని నింపేందుకు యత్నాలు జరుగుతున్నాయి.

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్!

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నీ ఓకే అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. షాకిచ్చిన రఘురామ కృష్ణరాజు

ఎత్తులకు పై ఎత్తులతో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇక లేరు..

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) మరణించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.

నందిత శ్వేతా నటించిన 'IPC 376' మూవీ ట్రైలర్ విడుదల

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376.