ముగ్గురు భామలు.. తొలి అడుగులు

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

ఫిబ్ర‌వ‌రి 2.. ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఒక్కో భాష‌లో ఒక్కో భామ తొలిగా అడుగులు వేస్తోంది మ‌రి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త్రిష‌, నిహారిక‌, ర‌ష్మిక మంద‌న్న‌.. ఈ ముగ్గురు భామ‌లు త‌మ‌కు ప‌రిచ‌యమే లేని వేరే భాష‌ల్లో త‌మ తొలి సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోవ‌డ‌మే ఈ ఫిబ్ర‌వ‌రి 2 ప్ర‌త్యేక‌త‌. తెలుగు, త‌మిళ్‌, కన్న‌డ భాష‌ల్లో ఇప్ప‌టికే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష మ‌ల‌యాళంలో 'హే జ్యూడ్' మూవీ ద్వారా అడుగులు వేస్తోంది. 'ప్రేమ‌మ్‌'తో అగ్ర క‌థానాయ‌కుల లిస్ట్‌లో చేరిపోయిన నివిన్ పౌలీ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా.. మ‌ల‌యాళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ్యామ్‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఫిబ్ర‌వ‌రి 2న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇక అదే రోజున మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక‌.. 'ఒరు న‌ల్ల నాళ్ పాతు సొల్రేన్' చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో నిహారిక న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. 'కిరిక్ పార్టీ'తో క‌న్న‌డంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ర‌ష్మిక మంద‌న్న.. 'ఛ‌లో' సినిమాతో అదే రోజున టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. తొలి తెలుగు చిత్రం త‌న‌కు క‌లిసొస్తుంద‌న్న ధీమాతో ఉందీ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఒకే రోజు.. మూడు వేర్వేరు భాష‌ల్లో ముగ్గురు ముద్దుగుమ్మ‌లు అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నార‌న్న‌మాట‌.