ప.గోలో విషాదం.. చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత
Send us your feedback to audioarticles@vaarta.com
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగుడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత గురయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిం వైద్యం చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురిలో ఒకరైన అభిచరణ్ తేజ (5) మృతి చెందగా.. కట్టం సంతోష్(7), మండలం రాహుల్(6) అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో అభి చరణ్ తేజ(5) మృతి చెందారు. ఈ ఘటనతో రాయిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాక్లెట్ ఎక్కడ ఉన్నారు..? ఆ షాపు యజమానికి ఎవరు అమ్మారు..? ఏ కంపెనీకి చెందినవి..? వాటిని ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు..? అనే విషయాలపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.