close
Choose your channels

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

Tuesday, August 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అమెరికాలో తమ కార్యకలాపాలపై ఆ దేశాధ్యక్షుడు డ్రొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించడంపై టిక్‌టాక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌తో లావాదేవీలను నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికాలోని ఫెడరల్ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసింది.

టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌తో లావాదేవీలను నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు.. దీనిలో పలు విషయాలను పొందు పరిచారు. టిక్‌టాక్, వుయ్ చాట్‌ వంటి చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈ నిషేధం రానున్న సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. టిక్‌టాక్ యూజర్ల సమాచారంతో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్ సమాచారాన్ని, నెట్‌వర్క్ కార్యకలాపాలు, బ్రౌజింగ్, సెర్చ్ హిస్టరీలను ఆటోమేటిక్‌గా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తెలుసుకుంటోందని.. దీని వలన తమ దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ముప్పు వాటిల్లే ప్రమాదముందని అమెరికా అభిప్రాయపడింది. అయితే ట్రంప్ ఉత్తర్వులు దురద్దేశపూరితమైనవని టిక్‌టాక్ తన ఫిర్యాదులో పేర్కొంది. యాప్‌ను నిషేధించేందుకు.. బైట్ డాన్స్ యాజమాన్య సంస్థ ఆస్తులను వదులుకోవాలని ఆదేశించడంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానం పక్షపాత వైఖరిని సూచిస్తోందని ఆరోపించింది. యూజర్లకు సంబంధించిన సమచారం సురక్షితంగా ఉంటుందని టిక్‌టాక్ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.