తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత.. విషాదంలో టీటీడీ

  • IndiaGlitz, [Monday,November 29 2021]

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు.  సోమవారం వేకువజామున గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు.

విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డాలర్ శేషాద్రి అక్కడే మరణించారు. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి విధులు నిర్వర్తిస్తున్నారు. 2007లోనే ఆయన పదవి విరమణ చేశారు. అయితే శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలోనే ఆయన వున్నారు.

డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీవ్రనష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేమని అభిప్రాయపడ్డారు.
 

More News

శివశంకర్ మాస్టర్ జాతకం చూసి జ్యోతిష్యుడు ఏమన్నాడో తెలుసా...?

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో నెటిజన్లు ఆయన గురించి ఇంటర్‌నెట్‌ను జల్లెడ పడుతున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్ రుణం తీర్చుకున్న సన్నీ.. రవి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చిన ఇంటి సభ్యులు

సండే ఫండే కావడంతో నాగార్జున ఎప్పటిలాగే ఇంటి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడించారు. ఇక సీజన్ ముగియడానికి మరికొద్దిరోజులే వుండటంతో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఇవ్వబోయే ప్రైజ్ మనీ డిటెయిల్స్ పంచుకున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: రవి ఎలిమినేషన్.. అన్యాయం జరిగిందంటూ తెలంగాణ జాగృతి ఆందోళన

బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షోకు తెలంగాణ సెగ తగిలింది. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోవడమే ఈ రచ్చకు కారణం.

టాలీవుడ్‌లో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న మాస్టర్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేవాగుణం చాటుకున్న ఓవ‌ర్సీస్ డిస్ట్రిబూట‌ర్స్

మోస్ట్ అవేట‌డ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాల‌య్య అభిమానులు , ఓవ‌ర్సీస్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ హాస్స‌ట‌ల్ లో జ‌రుగుతున్న సేవాకార్య‌క్ర‌మాల‌కు అండ‌గా నిలిచారు.