నేడే జనసేన ఆవిర్భావ దినోత్సవం


Send us your feedback to audioarticles@vaarta.com


వందశాతం స్ట్రయిక్ రేటు సాధించిన జనసేన పార్టీ, ఈ ఏడాది తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతోంది. దీనికి జయకేతనం అనే పేరు కూడా పెట్టింది. ఈరోజు పిఠాపురంలో ఆవిర్భావ సభ ఘనంగా జరగనుంది.
సా.4 గంటలకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభకు హాజరుకానున్నారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు.
సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు ఏకంగా 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. కార్యకర్తలందరికీ భోజన, నీటి సదుపాయం ఏర్పాటుచేశారు.
చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. జనసేన సభ కారణంగా పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు 11 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments