ఔటర్‌రింగ్‌ రోడ్డు పై 'టోల్‌' తీస్తున్నారుగా!

  • IndiaGlitz, [Tuesday,April 02 2019]

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) వాహనదారులకు అప్పుడప్పుడు సడన్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే ఔటర్‌రింగ్‌ రోడ్డుపై పలుమార్లు టోల్ రుసుము పెంచిన హెచ్ఎండీఏ తాజాగా మరోసారి పెంచింది. పలు కేటగిరీలకు చెందిన వాహనాల పై 5శాతం వరకు రుసుం పెంచుతున్నట్లు హెచ్ఎండీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం కిలోమీటర్‌కు 6 పైసల నుంచి 34 పైసలు పెంచడం జరిగింది. కాగా ఈ ఛార్జీలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే అస్తమాను ఇలా రుసుం పెంచుతుండటంతో వాహనాదారులకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈసారి మాత్రం పైసల్లో పెంపు జరగడంతో వాహనాదారులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.