కొరియ‌న్ యాక్ష‌న్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు

  • IndiaGlitz, [Wednesday,February 05 2020]

ప్ర‌స్తుతం మ‌న మూవీ మేక‌ర్స్ కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డ‌మే కాదు.. మంచి కాన్సెప్ట్ సినిమాల‌ను ఇత‌ర భాష‌ల నుండి రీమేక్‌లు కూడా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మ‌న మేక‌ర్స్ కొరియ‌న్ సినిమాల‌ను రీమేక్‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. గ‌త ఏడాది స‌మంత అక్కినేని న‌టించి 'ఓ బేబీ' చిత్రం 'మిస్ గ్రానీ' అనే కొరియ‌న్ మూవీకి రీమేక్ అనే సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా 2017లో విడుద‌లైన మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ అనే కొరియ‌న్ మూవీని రీమేక్ చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్న‌ద్ధాలు చేసుకుంటున్నారు. అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్న నిర్మాత ఎవ‌రో కాదు.. అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన డి.సురేశ్‌బాబు. ఈయ‌న ఇప్ప‌టికే రైట్స్ కొనేసి రీమేక్‌ల‌కు రంగం సిద్ధం చేసేస్తున్నార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

'మిడ్ నైట్ ర‌న్న‌ర్స్' సినిమాలో ఇద్ద‌రు హీరోలు పోలీస్ ట్రైనింగ్ ఉంటారు.. ఓ అర్థ‌రాత్రి వాళ్లు అనుకోకుండా విల‌న్స్ వెంట ఎలా ప‌డ‌తార‌నేదే క‌థ‌. అయితే తెలుగులో పూర్తిగా మారుస్తున్నార‌ట‌. హీరోల స్థానంలో హీరోయిన్స్‌ను చూపించ‌బోతున్నార‌ట‌. 'ఎవరు' లాంటి థ్రిల్లర్ తో ఆకట్టుకుంది రెజీనా. నివేదా కూడా గ్లామర్ రోల్స్ కంటే పర్ఫామెన్స్ కు స్కోప్ ఉండే క్యారెక్టర్సే ఎక్కువగా చేస్తోంది. వీరిద్దర్నీ ఒకే సినిమాలో చూపించబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు. ఆయన రీమేక్ చేయబోయే కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'లో రెజీనా, నివేదా స్టన్నింగ్ స్టంట్స్ చేయబోతున్నారట. అందుకోసం ఒరిజినల్ కొరియన్ వర్షన్ కి పని చేసిన ఫైట్ మాస్టర్స్ నే ఇక్కడికి తీసుకొస్తున్నట్టు సమాచారం. వారి శిక్షణలో బ్యూటీస్ ఇద్దరూ కొన్ని నెలల పాటూ కఠినమైన ఎక్సర్‌సైజులు, కిక్స్ అండ్ పంచెస్ ప్రాక్టీస్ చేస్తారట.

More News

నిర్మాత‌లుగా మారుతున్న రాజ‌మౌళి, ప్ర‌భాస్‌?

ఇప్పుడు స్టార్ హీరోలందరికీ దాదాపు స్వంత నిర్మాణ సంస్థ‌లున్నాయి. ఎన్టీఆర్‌కు అన్నయ్య క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉండ‌నే ఉంది.

ఒకే ఫ్రేములో రెండు చంద‌మామ‌లు

రెండు అంద‌మైన చంద‌మామ‌ల‌ను చూస్తున్నామా అని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే అస‌లు త‌మ అభిమాన హీరోయిన్ ఎవ‌రా?

నవీన్ చంద్ర హీరో హీరోయిన్ ఫిబ్రవరి 15న రిలీజ్ !!!

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో

'అర్ద శతాబ్ధం` ఫస్ట్ లుక్

రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై  కార్తిక్ రత్నం,  కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం  'అర్ద శతాబ్ధం`

‘కళ్యాణ్ దేవ్’  హీరోగా  ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో చిత్రం

మంచి కధాబలం కలిగిన చిత్రాలను ప్రముఖ చిత్ర  నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించటం అన్నది ఇటీవల కాలంలో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న వైనం గమనార్హం.