కొత్త సంవత్సరం టాలీవుడ్‌లో తొలి విషాదం.. దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత

  • IndiaGlitz, [Monday,January 03 2022]

గతేడాది కరోనా, తదితర కారణాలతో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2022 అయినా సాఫీగా, సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు ప్రజలు. అయితే కొత్త సంవత్సరంలోనే తొలి విషాదం చోటు చేసుకుంది. అలనాటి సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి (86) కన్నుమూశారు. ఈ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. పీసీ రెడ్డి దాదాపు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజ నటుల చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే సూపర్‌స్టార్‌ కృష్ణ చిత్రాలకు ఎక్కువగా చేశారు. భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు.

పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న ఆయన జన్మించారు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నటుడు వల్లం నరసింహారావు పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతోనే 1960లో రూపొందిన ‘శ్రీకృష్ణరాయబారం’ చిత్రానికి డైరెక్టర్ ఎన్.జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద 11 సంవత్సరాలు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు పి.సి.రెడ్డి. ఆపై ఆదుర్తి సుబ్బారావు వద్ద ‘పూలరంగడు’ చిత్రానికి కో-డైరెక్టర్ గా ఉన్నారు. అనంతరం 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు.

More News

చిన్న సినిమాల నెత్తిన పాలు పోసిన ‘‘ఆర్ఆర్ఆర్’’.. సంక్రాంతి బరిలో రాజశేఖర్ ‘‘శేఖర్’’..?

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా 'శేఖర్'.  ‘‘గరుడవేగ’’.. ‘‘

నా మౌనం చేతకానితనం కాదు .. ‘‘నలుగురి’’నే పిలుస్తారా : టికెట్ ధరల వివాదంపై మోహన్ బాబు స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలు, థియేటర్లు తదితర సమస్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

కొత్త సంవ‌త్స‌రం స‌రికొత్త ఉత్సాహాంతో య‌స్ ఓరిజిన‌ల్స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్..

కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల‌తో త‌న‌దైన ముద్ర‌ను సొంతం చేసుకున్న య‌స్ ఓరిజిన‌ల్స్ రాబోయే సంవ‌త్స‌రంలో

'సానా క‌ష్టం' అంటూ రెజీనాతో చిరు స్టెప్పులు... 'ఆచార్య' సాంగ్ ప్రోమో కేక

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఔను కాజల్ ప్రెగ్నెంట్.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ కిచ్లు, ఒకే ఒక్క పోస్ట్‌తో ప్రచారానికి చెక్

గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి సినీ నటి కాజల్ దంపతులు తెరదించారు. న్యూఇయర్ కానుకగా ఆమె తన అభిమానులకు శుభవార్త చెప్పారు.