టాలీవుడ్ ప్రముఖ సింగర్స్‌కి కరోనా!

  • IndiaGlitz, [Tuesday,August 18 2020]

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. నిర్మాత బండ్ల గణేష్‌తో మొదలైన ఈ కరోనా ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదు. డైరెక్టర్స్ రాజమౌళి, తేజ, అజయ్ భూపతి.. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.. ఇటీవల గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు టాలీవుడ్ సింగర్స్‌కి కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.

సింగర్స్ సునీత, మాళవికలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ అనారోగ్యం పాలవడంతో పరీక్షకు వెళ్లగా ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. వీరిద్దరూ ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమంలో గత కొంతకాలంగా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం ద్వారానే వీరిద్దరూ కరోనా బారిన పడినట్టు సమాచారం. వీరిద్దరే కాదు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న చాలా మంది కరోనా బారినట్టు టాక్ నడుస్తోంది.

కాగా.. ప్రస్తుతం గాన గంధర్వుడు ఎస్పీ బాలు పరిస్థితి విషమంగా ఉండటంతో యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ నిర్వహించాలని టాలీవుడ్ సంగీత దర్శకులు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్పీ పట్నాయక్ ఓ వీడియోను సైతం విడుదల చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు అంతా ఒకేసారి ఈ ప్రేయర్స్ నిర్వహించాలని.. ఆ పాజిటివ్ వైబ్రేషన్ కారణంగా గాన గంధర్వుడు ఆరోగ్యంగా తిరిగి వస్తారని నమ్ముతున్నారు.

More News

అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా.. వైద్యులేమన్నారంటే..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. నేడు ఆయన తిరిగి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

ట్విట్టర్ వేదికగా అంబటి వర్సెస్ జనసేన వార్..

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది.

సంచలనం సృష్టించిన నోవాటెల్ ఘటనలో నిందితుడి అరెస్ట్

విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర జరిగిన దారుణం జరిగింది. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు.

నిత్యానంద సంచలన నిర్ణయం.. ముహూర్తం కూడా ఫిక్స్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన ఓ సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు.

ప్ర‌భాస్ 22వ చిత్రం ప్ర‌క‌ట‌న‌.... పౌరాణిక‌మా!!

బాహుబ‌లి త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో విడుద‌ల త‌ర్వాత రాధేశ్యామ్ సెట్స్‌పై ఉంది.