టాలీవుడ్‌ హీరోలంతా ఒకే వేదికపై కలిసిన వేళ..!

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

టాలీవుడ్ హీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రిరిలీజ్ ఈవెంట్స్‌, సినిమా థియేటర్లలో, జిమ్‌లలో, విదేశీ యాత్రల్లో కలుస్తుంటారు. అంతేకాదు.. ఒక హీరో ఇంట్లో ఏమైనా చిన్నపాటి ఫంక్షన్‌ జరిగినా నటీనటులందరూ కలుస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు పొరపచ్చాలు లేకుండా అంతా కలివిడిగా ఉంటారు. తాజాగా.. టాలీవుడ్‌ యంగ్ హీరోలిద్దరూ కలిశారు.

యాక్షన్ హీరో గోపీచంద్‌ ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్‌‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు హాజరయ్యారు. శనివారం నాడు గోపీచంద్‌ తనయుడు వియాన్స్‌ ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకకు హాజరుకావాలని గోపీచంద్.. అందరినీ ఆహ్వానించారు. ఆయన పిలుపు మేరకు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మంచు విష్ణు, రామ్‌, తేజ, బోయపాటి శ్రీను, సంపత్‌ నంది, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు విచ్చేశారు.

ఇదిలా ఉంటే.. గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌ చివరలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

More News

కారును తోసి ఫిట్‌నెస్ పెంచుకున్న సుధీర్ బాబు

హీరోలందు నేను వేర‌యా! అనే త‌ర‌హాలో సుధీర్‌బాబు చేసిన ప్ర‌య‌త్నం ఈరోజు అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

క‌న్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ న‌టిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

'బందోబస్త్' కంప్లీట్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్ - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు డా. రాజశేఖర్ రూ. 10 లక్షల విరాళం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా

షకీలా సమర్పణ లో 'లేడీస్ నాట్ ఎలౌడ్'

సెన్సెషనల్ స్టార్ షకీలా  సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం "లేడీస్ నాట్ ఎలౌడ్" .