మ‌ణిర‌త్నం ‘న‌వ‌ర‌స‌’లో టాలీవుడ్ స్టార్స్‌..?

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నార‌ని స‌మాచారం. మ‌నిషి ప్ర‌ద‌ర్శించే తొమ్మిది ర‌సాల‌ను ఆధారంగా చేసుకుని ‘న‌వ‌ర‌స‌’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించ‌నున్నార‌ట‌. ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మ‌ది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ర‌సం చుట్టూ తిరుగుతుంటుంది. అలాగే ఒక్కొక్క ఎపిసోడ్‌ను మ‌ణిర‌త్నంతో క‌లిపి తొమ్మిది మంది ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

ఇందులో సూర్య‌, విక్ర‌మ్‌, మాధ‌వ‌న్‌, సిద్ధార్థ్ వంటి హీరోలు కూడా న‌టించే అవ‌కాశాలున్నాయని అంటున్నారు. వీరితో పాటు తెలుగు హీరోల‌ను కూడా మ‌ణిర‌త్నం ఈ వెబ్ సిరీస్‌లో న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, నాని, కార్తికేయ వంటి హీరోల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని టాక్‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం మ‌ణిర‌త్నం ఈ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి మ‌ణిర‌త్నంతో పాటు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌బోయే దెవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొత్త‌గా ఆలోచించాలి:  ఆర్జీవీ

రాజమౌళి క్రియేటివిటీ వల్ల ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయ్యారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

పండ‌గ పందెంలో నితిన్‌..?

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’ చిత్రంతో

ప‌వ‌న్ 27 కోసం మ‌రో టైటిల్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో

ఈటలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ తెలంగాణ

ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌పై ట్వట్టర్ వేదికగా తెలంగాణకు చెందిన పలు జిల్లాల వాసులు మండిపడ్డారు.

ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న కరోనా.. నేడు 9 మందికి పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.