close
Choose your channels

ఓయూ: చెట్ల మధ్యలో 'సమాధి' కలకలం.. పరుగులు తీసిన విద్యార్ధులు

Monday, November 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓయూ: చెట్ల మధ్యలో సమాధి కలకలం.. పరుగులు తీసిన విద్యార్ధులు

చదువుల తల్లి సరస్వతి దేవి నడయాడే విద్యా నిలయం.. ఎందరో విద్యార్ధులను దేశానికి అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్ వెనుకవున్న అటవీ ప్రాంతంలో సమాధిని చూశారు.

దీంతో భయాందోళనకు గురైన విద్యార్ధులు...తిరిగి హాస్టల్స్‌కు పరుగెత్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈసీహెచ్‌-1 హాస్టల్‌కు దగ్గరగా వున్న చెట్ల మధ్యలో ఈ సమాధి వెలుగుచూసింది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి. అక్కడ జంతువును పూడ్చిపెట్టారా లేక మరేదేమైనా వుందా అంటూ విద్యార్థులు అనుమానిస్తున్నారు.

ఓయూ: చెట్ల మధ్యలో సమాధి కలకలం.. పరుగులు తీసిన విద్యార్ధులు

యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే తాజా వెలుగుచూసిన ‘‘సమాధి’’ ఘటనతో వర్సిటీలో భద్రతపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.