close
Choose your channels

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

Friday, April 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 22 నుంచి ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసేస్తున్నారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో రోడ్డు మరమ్మతు పనులను చేపడుతుండడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలిగించి బీటీ(బ్లాక్ టాప్) రోడ్డును వేస్తున్నారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు ఒక వైపుగా శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నామని.. దీంతో వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించుకుని ప్రయాణం సాగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంక్షలు ఇవీ...

1:- విమానాశ్రయం, శంషాబాద్ నుంచి వచ్చే వాహనదారులు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపు ఎక్కకుండా అరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నం మీదుగా నగరంలోకి వెళ్లాల్సి ఉంది.

2:- చాంద్రాయణగుట్ట, జూ పార్క్‌రోడ్డు, శివరాంపల్లి నుంచి వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, హైదరాబాద్ వైపు రావాలంటే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింద నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నంకు చేరుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.