నటుడు మురళీ మోహన్ ఇంట విషాదం..

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంట విషాదం నెలకొంది. గురువారం మురళీ మోహన్ తల్లి మాగంటి వసుమతిదేవి తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా.. వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇటీవలే మురళీమోహన్ తన తల్లి మాగంటి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే.

రేపు అంత్యక్రియలు..

శుక్రవారం ఉదయం వసుమతీదేవి అంత్యక్రియలు రాజమండ్రిలోని జేఎన్ రోడ్‌లో కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. మురళీకి మాతృవియోగం కలిగినట్లు తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. రేపు జరగనున్న అంతిమ సంస్కారాలకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పాటు పలువురు ఆయన సహచరులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

More News

ఆర్జీవీ మరో సంచలనం.. కేసీఆర్‌పై సినిమా

వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే పలు బయోఫిక్‌‌లు, వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్య అల్లుడికి భయం భయం.. జోష్‌లో జనసేన!

అవును మీరు వింటున్నది నిజమే.. నందమూరి బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

'47 డేస్' మూవీ తప్పకుండా విజయం సాధిస్తుంది- ట్రైల‌ర్ లాంచ్ వేడుకలో అథిదులు

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’

బన్నీ స్థానంలో క్రికెటర్ ధోనీ.. అలీ ఔట్!

ప్రముఖ బస్ టిక్కెటింగ్ ప్లాట్‌ఫాం ‘రెడ్‌బస్’ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచురణ పొందిన ప్లాట్‌ఫాం ఇది.

ప్రతినాయకిగా

అందాల తార నయనతార ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో మెప్పించనున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'దర్బార్‌'.