ఫలించని రెస్క్యూ ఆపరేషన్ .. సింగరేణిలో విషాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురూ మృతి

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో గనిలో చిక్కుకుపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ (ఏఎల్‌పీ) బొగ్గు గనిలో సోమవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు.

వీరిలో ఇద్దరు అదేరోజు రాత్రి ప్రాణాలతో బయటపడగా.. సేఫ్టీ మేనేజర్‌ జయరాజ్‌, గని అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్యతేజ, బదిలీ వర్కర్‌ రవీందర్‌, కాంట్రాక్ట్ ఉద్యోగి తోట శ్రీకాంత్‌ చిక్కుకున్నారు. వీరిలో రవీందర్‌ను మంగళవారం సాయంత్రం సహాయక సిబ్బంది కాపాడారు. గనిలో చిక్కుకున్న మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్‌, శ్రీకాంత్‌ మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

ఇక ఇప్పటికే బొగ్గుగని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధిత కార్మిక కుటుంబాలకు అండగా ఉండాలని సింగరేణి సీఎం శ్రీధర్‌కు సూచించారు. అటు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే బొగ్గుగని పైకప్పు కూలిందని.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

More News

కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన

స్పెయిన్‌లో స్టెప్పులేస్తోన్న రామారావు

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..

శృతి హాసన్‌కి మరో బంపరాఫర్.. చిరు పక్కన ఛాన్స్, స్వయంగా అనౌన్స్ చేసిన మెగాస్టార్

విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన అందం, నటనతో దూసుకెళ్తున్నారు. మధ్యలో కొంచెం స్లో అయినా ఇటీవలి కాలంలో

హైదరాబాద్‌‌లోని మహిళా పోలీసులకు ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో.. ఎందుకంటే..?

హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించని సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. వచ్చీ రాగానే  డ్రగ్స్ మాఫియా

రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది.