కాచిగూడలో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెనుప్రమాదం

  • IndiaGlitz, [Monday,November 11 2019]

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగివున్న పాసింజర్ రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్నది. ఈ ఘటనలో సుమారు 35మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. సాంకేతిక లోపంతో ట్రైన్ ఆగివున్న ట్రాక్‌లోకి ఎంఎంటీఎస్ వచ్చింది. కాగా ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్లతోంది. పాసింజర్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

కాగా ఎంఎంటీఎస్‌లోని మూడు.. పాసింజర్‌లోని మూడు మొత్తం ఆరు కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. పక్కనే ఉన్న రైలు పట్టాలపై ఆరు కోచ్‌లు పడిపోయాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఎంఎంటీఎస్ డ్రైవర్ శేఖర్ ఇంజన్‌లో ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ను బయటికి తీసేందుకు రైల్వే పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇదిలా ఉంటే.. గాయపడినవారిలో ఎక్కువ ఎంఎంటీఎస్ వాళ్లే.. స్టేషన్ వచ్చింది కదా అని దిగడానికి రెడీగా ఉన్న టైమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో పదిమందిని ఉస్మానియా ఆస్పత్రికి మిగిలిన వారిని కాచిగూడ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

ట్రంప్‌‌కు ఊహించని ఝలక్‌.. ఇండియన్స్‌కు తియ్యటి శుభవార్త

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాన్ని కల్పిస్తూ ఒబమా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ట్రంప్ రద్దుచేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సంస్కరణల ఆద్యుడు టీఎన్‌ శేషన్‌ ఇకలేరు..

భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చిన.. ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచిన మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ (87) తుదిశ్వాస విడిచారు.

పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథే ‘విజయ్ సేతుపతి’: దర్శకుడు విజయ్ చందర్

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘సంగ తమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేశ్‌..?

విక్టరీ వెంక‌టేశ్ హీరోగా త‌మిళ చిత్రం `అసుర‌న్‌` రీమేక్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`.

తన ప్లానింగ్ తో అందరికి షాకిచ్చిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇప్పుడు హిట్ మిష‌న్‌గా మారాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో పాటు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ న‌టిస్తూ అక్ష‌య్ దూసుకెళ్తున్నాడు.