ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే విషయం తెలియాలంటే 'ఆచార్య' సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌. ఈ సినిమా టీజర్‌ను జనవరి 29, శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌కు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించారు.

'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకు ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో' అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ధర్మస్థలిలో ధర్మ సంరక్షణార్థం ఆచార్యగా ఏం చేశాడనే విషయాలను యాక్షన్‌ ప్యాక్‌డ్ ఆచార్య టీజర్‌లో చూపించారు. టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలుస్తోంది.

ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను ఈ టీజర్‌లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద భారీ టెంపుల్‌ సెట్‌ ఇది. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఎస్‌.తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More News

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగించారు.

రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు సహా ఆరుగురి దుర్మరణం

కూతురి పెళ్లిని ఎంతో ఆనందంగా.. ఘనంగా జరిపించాలనుకున్నారు. వచ్చే నెల 10వ తారీఖున క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించేందుకు ఇరువైపుల పెద్దలూ ముహూర్తం నిశ్చియించారు.

'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలో 'మ‌న‌సు క‌థ' పాట‌ను విడుద‌ల చేసిన అద‌న‌పు డీసీపీ మ‌ద్దిపాటి శ్రీ‌నివాస్ రావు

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించిన 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలోని మూడో పాట "మ‌న‌సు క‌థ‌"ను

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన

కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లలు కాయలు కాసేలా ఎదురు చూసిన ప్రజానీకం.. తీరా వచ్చాక మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాల వైపు కూడా చూడటం లేదు.

ఎస్ఈసీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం.. మరో వివాదం

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా అయితే కనిపించట్లేదు.