పెళ్లిపై త్రిష ఇంత మాట అనేసిందేంటి!?

  • IndiaGlitz, [Friday,January 24 2020]

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన చెన్నై పొన్ను, దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిషను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. కొందరు హీరోల సరసన త్రిష తప్ప మరొక్కరు సెట్ కారనేంత రేంజ్‌లో ఈ ముద్దుగుమ్మ గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగేకాదు.. టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. అయితే.. ఆ తర్వాత వరుస అవకాశాలు తగ్గిపోవడంతో ఈ అందాల భామ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఏం జరిగిందో ఏమోగానీ.. పెళ్లి పీటలదాకా వెళ్తుందనుకున్న సమయానికి అది కాస్త పెటాకులైంది. దీంతో నాటి నుంచి నేటి వరకూ పెళ్లి అంటే చాలు చిరాకెత్తేలా ఈ బ్యూటీ మాట్లాడేస్తోంది.

సోషల్ మీడియా ద్వారా అభిమానులు, నెటిజన్లకు బాగా టచ్‌లో ఉండే త్రిష.. తాజాగా నెట్టింట్లో ఓ వీరాభిమాని పెళ్లి గురించి అడగ్గా... ఆసక్తికరంగా సమాధానిమచ్చింది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదుని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని ఆమె తనకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్‌లోనే చేసుకుంటానని మనసులోని మాటను బయటపెట్టింది. అయితే ఇలా వేగాస్‌లో పెళ్లి చేసుకోవడం అంటే త్రిష డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని చెబుతోంది. ఆమె చెప్పిన సమాధానానికి పలువురు నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరి నచ్చిన మగాడు ఈ బ్యూటీకి ఎప్పుడు దొరుకుతాడో.. పెళ్లి ఎప్పుడవుతుందో.. కల ఎప్పుడు నెరవేరుతుందో..!. కాగా.. ప్రస్తుతం మూడు సినిమాలో ఈ స్లిమ్ బ్యూటీ బిజిబిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. అంతేకాదు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ ముద్దుగుమ్మ నటించబోతోంది. ఇప్పటికే చిరు-త్రిష ఇద్దరూ ‘స్టాలిన్’ మూవీలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

More News

సెన్సార్ కోసం ఎదురు చూస్తున్న 'శివ 143'

సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం.

ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ తీర్చింది: వి.ఎన్. ఆదిత్య

తొలి చూపు... తొలి వలపు- ఈ  రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య  ఓ తలుపు  కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద  కథే ఉంటుంది...

థ్రిల్లర్‌ చిత్రంతో హీరోగా వస్తున్న మిథున్‌ చక్రవర్తి కుమారుడు

బాలీవుడ్‌లో 'డిస్కోడాన్సర్‌'తో అప్పట్లో యువతను ఉర్రూతలూరించిన కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు.

ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేక విమాన‌మా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక ప‌క్క సినిమాలు.. మ‌రో ప‌క్క రాజ‌కీయాల‌తో త‌ల మున‌క‌లై ఉన్నారు.

వీళ్లంద‌రినీ ఆడించే సూత్ర‌ధారి ఎవ‌రు(`అశ్వ‌థ్థామ` ట్రైల‌ర్‌)

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'అశ్వథ్థామ'.