close
Choose your channels

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

Saturday, January 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కాంబినేషన్‌పై ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తున్నప్పటికీ.. తాజా చర్చలు మాత్రం దాన్ని నిజం చేసే దిశగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెలువడనున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘జాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘సాహో’ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రభాష్ అభిమానుల్లోనే కాకుండా.. సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇదలా ఉంటే.. త్రివిక్రమ్ తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ పూజా హెగ్డే నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. భారీ తారాగణంతో.. త్రివిక్రమ్ శైలి టేకింగ్‌తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి.. పందెం కోడిలా కాలుదువ్వుతోంది. అటు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో.. పోటీ మొత్తం ఈ రెండు సినిమాల చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు ఈ రెండు సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.