close
Choose your channels

త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

Monday, June 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్ర‌మ్‌.. 16 ఏళ్ళ త‌రువాత‌

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. `నువ్వే నువ్వే`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు. ఆ త‌రువాత అత‌డు, `జ‌ల్సా, ఖ‌లేజా, జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అఆ, అజ్ఞాత‌వాసి` చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో `అర‌వింద స‌మేత`.. వీర రాఘ‌వ చేస్తున్నారు త్రివిక్ర‌మ్.

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబ‌ర్ 10న విజ‌య ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ తొలి చిత్ర‌మైన `నువ్వే నువ్వే` కూడా 16 ఏళ్ళ క్రితం ఇదే అక్టోబ‌ర్ 10న ద‌స‌రా కానుక‌గా విడుద‌లై విజ‌యం సాధించింది. మ‌రి.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. త్రివిక్ర‌మ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లో వ‌చ్చిన‌ట్లే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.