త్రివిక్ర‌మ్ డబుల్ ధ‌మాకా?

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

ఏడాదికో సినిమా.. లేదంటే రెండు మూడేళ్ల‌కో సినిమా.. ఇలా ఉంటుంది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చే సినిమాల ప‌రిస్థితి. అలాంటి త్రివిక్ర‌మ్ వ‌చ్చే ఏడాది త‌న అభిమాల‌కు, ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజింగ్ షాక్ ఇవ్వ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ త‌న తాజా చిత్రాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అజ్ఞాత వాసి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సంగీత‌మందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం త‌రువాత ఎన్టీఆర్ హీరోగా త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్లాన్ చేశారు త్రివిక్ర‌మ్‌. మార్చిలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదే గ‌నుక జ‌రిగితే.. ఒకే ఏడాదిలో త్రివిక్ర‌మ్‌.. ద‌ర్శ‌కుడిగా డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న‌ట్లే. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

More News

'రంగ‌స్థ‌లం' కొత్త డేట్‌..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'రంగ‌స్థ‌లం'. అక్కినేని స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది.

నవంబర్‌ 17న 'ఖాకి' భారీ రిలీజ్

"మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌" అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌’ ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూట

వైరల్ అవుతోన్న కోహ్లీ-అనుష్క వీడియో

‘కోహ్లీ-అనుష్క’ కలిసి నటించిన ఓ వీడియో యాడ్ ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'మ‌నం' ముందుగా...

అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మ‌నం' వారికి మ‌ర‌చిపోలేని గుర్తు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే కాదు. అక్కినేని మూడు త‌రాల న‌టులు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అక్కినేని నాగార్జున‌, చైత‌న్య, అఖిల్ అంద‌రూ క‌లిసి న‌టించారు.

కొత్త‌గా పూరి...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు ఇప్పుడు స‌రైన హిట్ లేదు. ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాల‌ని ఆశ‌గా వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా త‌న త‌న‌యుడు ఆకాష్ పూరితో త‌న స్వంత నిర్మాణంలో 'మెహ‌బూబా' అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.