ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్కు...15 మంది మృతి

  • IndiaGlitz, [Tuesday,January 19 2021]

అవి అసలే ఫుట్‌పాత్ జీవితాలు.. వీలైతే కలో గంజి.. లేదంటే కుళాయి నీళ్లు తాగి బతుకు బండి లాగిస్తుంటారు. ఇక నిలువ నీడ ఉండదు.. ఇంతటి ఘోరమైన చలిలోనూ ఫుట్‌పాత్‌లే గతి.. అలాంటి జీవితాలపైకి మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. నిద్రపోతున్న వారిని శాశ్వత నిద్రలోకి పంపేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర సమీపంలో జరిగింది.

సూరత్ నగర సమీపంలోని కోసంబి పట్టణంలో ఫుట్ పాత్‌పై 18 మంది నిద్రిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సూరత్‌లోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజస్థాన్‌లోని బాన్సువాడ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తారని తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది నెలల పసికందు సురక్షితంగా బయటపడగా.. చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలు కోల్పోవడం మరింత దయనీయంగా మారింది.

More News

పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం..

పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. ఇప్పటికే ఏలూరులో వింత వ్యాధి సంచలనం రేపిన విషయం తెలిసిందే.

సీఎం మార్పుపై ఈటల క్లారిటీ..!

ఇటీవల రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సీఎం మార్పు. సీఎం కేసీఆర్ తన స్థానంలో తన తనయుడిని కూర్చోబెట్టబోతున్నారన్న ప్రచారం ఇటీవలి కాలంలో మరింత జోరందుకుంది.

అత్యున్నత సాంకేతికతో ప్రభాస్‌ ఆదిపురుష్‌.. ముహూర్తం ఫిక్స్‌

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్పీడు పెంచేశాడు. ఎంత స్పీడంటే ఇతర టాలీవుడ్‌ హీరోలే కాదు,

వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరి మృతి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కూడా వ్యాక్సిన్ అనంతర మరణాలు నమోదవుతున్నాయి.

జనసైనికుడిపై ఎమ్మెల్యే వీరంగం.. మనస్థాపంతో ఆత్మహత్య

జనసేన కార్యకర్తపై ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు విరుచుకు పడ్డారు.