టిక్‌టాక్‌పై కొరడా ఝుళిపించిన ట్రంప్..

చైనా యాప్‌లపై అమెరికా సైతం కొరడా ఝుళిపించింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌తో లావాదేవీలను నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు.. దీనిలో పలు విషయాలను పొందు పరిచారు. టిక్‌టాక్, వుయ్ చాట్‌ వంటి చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈ నిషేధం రానున్న 45 రోజుల్లో అమల్లోకి రానుంది.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. టిక్‌టాక్ యూజర్ల సమాచారంతో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్ సమాచారాన్ని, నెట్‌వర్క్ కార్యకలాపాలు, బ్రౌజింగ్, సెర్చ్ హిస్టరీలను ఆటోమేటిక్‌గా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తెలుసుకుంటోందని.. దీని వలన తమ దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ముప్పు వాటిల్లే ప్రమాదముందని అమెరికా అభిప్రాయపడింది. ఇప్పటికే టిక్‌టాక్‌ను ఇండియాలో నిషేధించడంతో ఆ సంస్థ యాజమాన్యానికి భారీ దెబ్బే తగిలింది. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో టిక్‌టాక్ మరింత కష్టాల్లో కూరుకుపోయింది.

More News

‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్

‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశాడు.

అభిమానులకు కానుక సిద్ధం చేస్తున్న నాగ్!!

ఈ ఆగ‌స్ట్ 29న కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ నుండి టీజ‌ర్‌ను విడుద‌ల

పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. కీలక విషయాలపై చర్చ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.

మ‌రో యంగ్ హీరో జోడీగా కేతికాశ‌ర్మ‌

ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’లో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అభిమానుల‌కు మ‌హేశ్ రిక్వెస్ట్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 9.. రెండు రోజుల వ్య‌వ‌థి మాత్ర‌మే ఉంది.