తెలంగాణలో కొలువుల జాతర: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్‌తోనే ఎంపిక

  • IndiaGlitz, [Wednesday,April 27 2022]

తెలంగాణలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఆ తర్వాత మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియలో భాగంగా ఈరోజు గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక విడుదల చేసిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే. ఈ మేరకు మంగళవారం 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్రూప్-1కి సంబంధించి మొత్తం 19 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. 900 మార్కులు రాత పరీక్ష నిర్వహించి.. మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు:

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి - 5
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -38
అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ - 20
డీఎస్పీ పోస్టులు - 91
జైళ్లశాఖలో డీఎస్పీ - 2
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ - 8
జిల్లా ఉపాధి అధికారి - 2
జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి - 6
గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ - 35
మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి - 121
జిల్లా పంచాయతీ అధికారి - 5
సీటీఓ పోస్టులు - 48
డిప్యూటీ కలెక్టర్లు - 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 26
ప్రాంతీయ రవాణా అధికారి - 4
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి - 2

More News

'సిద్ధ' పాత్ర చరణ్‌కు బదులు పవన్‌ చేసుంటే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఒకరు వృద్ధ బానిస.. మరొకరు యువ బానిస, కుక్కల్లా మొరగొద్దు : అంబటి, గుడివాడలకు జనసేన నేతల వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎవరికో దత్తపుత్రుడు, దగ్గరి పుత్రుడు అంటున్న వైసీపీని 15 సీట్లకే పరిమితం చేస్తామని హెచ్చరించారు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్.

వ్యవసాయం అంటే తెలియదు.. మీరు అగ్రికల్చర్ మినిస్టర్ : కాకాణిపై జనసేన నేత కిషోర్ ఆగ్రహం

ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం భరించలేకే తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ వ్యక్తిగత విమర్శలు

వ్యక్తిగత విమర్శలొద్దు.. ‘‘చెత్తపుత్రుడు’’ అనాల్సి వస్తుంది: మంత్రి అమర్‌నాథ్‌కు జనసేన నేత బొలిశెట్టి వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఫైరయ్యారు.

‘‘ అంబటి రాసలీలలు, పావుగంట సుకన్య... అరగంట సంజన’’... టైటిల్ రిజిస్టర్ చేశాం: జనసేన నేత రియాజ్

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.