టీటీడీ పాలకమండలి సభ్యులు ఖరారు.. జగన్ సమన్యాయం!

  • IndiaGlitz, [Tuesday,September 17 2019]

టీటీడీ చైర్మన్‌గా వైసీపీ సీనియర్, వైఎస్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పాలకమండలి సభ్యులను పెండింగ్‌లో పెట్టిన సర్కార్.. మంగళవారం నాడు సభ్యుల పేర్లు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది. ఇదివరకున్న 16 మంది సభ్యులు కాకుండా సంఖ్యపెంచిన ప్రభుత్వం.. అది కాస్త 28కి పెంచింది. ఈ మొత్తం సభ్యుల్లో.. ఏపీ నుంచి 8మంది, తెలంగాణ 7 మంది, తమిళనాడు నుంచి 4, కర్ణాటక నుంచి 3, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొకరు చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ఓ ప్రకటనలో సర్కార్ తెలిపింది. అయితే త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి ఎవరెవరు!?

- రామేశ్వరరావు
- బి.పార్థసారథిరెడ్డి
-వెంకటభాస్కరరావు
- మూరంశెట్టి రాములు
- డి.దామోదరరావు
- కె.శివకుమార్
-పుట్టా ప్రతాప్‌రెడ్డి

ఏపీ నుంచి ఎవరెవరు!?

- గొల్ల బాబూరావు
- నాదెండ్ల సుబ్బారావు
- ప్రశాంతి
- యూవీ రమణమూర్తి
- మల్లికార్జునరెడ్డి
-  డీపీ అనంత
- చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌
- పార్థసారథి

ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి శివశంకరన్‌, మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మ, కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తిలకు అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే తిరుపతికి పక్కనే ఉన్న తమిళనాడు నుంచి మాత్రం ఒకరిద్దరూ కాదు ఏకంగా నలుగుర్ని తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. వీరిలో వైద్యనాథన్‌, శ్రీనివాసన్‌, డా.నిశ్చిత, కుమారగురు ఉన్నారు.

సమన్యాయం!

మొత్తానికి చూస్తే ఏపీకి చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాలకు సీఎం వైఎస్ జగన్ సమన్యాయం చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు పాలకమండలిలో స్థానం ఆశించిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..!

More News

నిర్మాత పివిపి అకౌంట్‌లో గోల్ మాల్‌.. మేనేజ‌ర్‌పై కేసు న‌మోదు ?

ప్ర‌ముఖ సినీ నిర్మాత పి.వి.పి బ్యాంకు ఖాతా నుండి ప‌ది కోట్ల రూపాయ‌లు గ‌ల్లంతైన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పి.వి.పి ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా చెప్పుకునే భాను ప్ర‌కాశ్ అనే వ్య‌క్తే ఈ మొత్తాన్ని

మోదీ బ‌యోపిక్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ప‌లు రంగాల్లోని కీల‌క వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ కోవ‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. అ

కోడెల మృతిపై చంద్రబాబు, బాలయ్య ఆవేదన!

టీడీపీ కీలకనేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సైరా ప్రిరీలీజ్ ఈవెంట్ వాయిదా..!?

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

బోటు ప్రమాద బాధితులను చూసి జగన్ భావోద్వేగం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏరియల్ సర్వే నిర్వహించారు.