Tirumala Rush: పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు, ఇప్పట్లో తిరుమల రావొద్దన్న టీటీడీ

  • IndiaGlitz, [Sunday,May 29 2022]

తిరుమల శనివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్స్ నిండిపోయి... క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యమైంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ సిబ్బంది వెల్లడించారు. వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.

సోమవారం వరకు భక్తుల రద్దీ:

దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ రంగంలోకి దిగింది. కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. అదే సమయంలో సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సైతం తమ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

ఇప్పట్లో తిరుమల రావొద్దు:

ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని టీటీడీ చెబుతోంది. కావున భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోచాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు... అలాగే తిరుమలలో రద్దీ దృష్ట్యా మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, సిఫారసు లేఖలతో వచ్చేవారు గమనించాలని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

More News

NTR Satha Jayanthi: ఆయనో అభ్యుదయవాది.. ఎన్టీఆర్‌కు పవన్ కల్యాణ్ ఘన నివాళులు

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

RK Roja : ఆయనంటే భయం.. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి తరిమేశారు : చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైరయ్యారు.

Green Bawarchi Hotel : రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. లోపల చిక్కుకుపోయిన 20 మంది

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాయదుర్గంలోని ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సజ్జల ఏం చెప్పారో.. మంత్రుల నోటా అదే, అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే: జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని ఆరోపించారు జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ .

Ladakh Accident : మాటల కందని విషాదం.. లఢఖ్ ప్రమాదంలో సైనికుల దుర్మరణంపై పవన్ దిగ్భ్రాంతి

లఢఖ్‌ వద్ద బస్సు నదిలో దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలైన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్