భ‌ర‌త్ అనే నేను.. ఆ రెండూ కీల‌క‌మే

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌మైక్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్న చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌తో ఆ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇదిలా ఉంటే.. టీజ‌ర్‌లో అమ్మ‌కో ప్రామిస్ చేశా అంటూ మ‌హేష్ చెప్పే డైలాగులో రెండు అంశాలు ఆస‌క్తిగా అనిపించాయి. ఒక‌టి.. త‌ను చేసిన ప్రామిస్‌. రెండు.. ఆ ప్రామిస్ చేయించుకున్న అమ్మ‌.

ఆ ప్రామిస్ చుట్టూ సినిమా న‌డుస్తుంది కాబ‌ట్టి.. విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆ విష‌యం సస్పెన్స్‌గానే ఉంటుంది. ఇక రెండో విష‌యం.. ఆ అమ్మ ఎవ‌రు? అనేది. ఈ చిత్రంలో నిన్న‌టి త‌రం క‌థానాయిక‌లు ఆమ‌ని, సితార కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మ‌రి క‌థ‌లో కీల‌క‌మైన ఆ పాత్ర‌లో ఆమ‌ని న‌టిస్తోందా? లేదంటే సితార న‌టిస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. అమ్మ‌, ప్రామిస్ అనే రెండు అంశాలపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

కైరా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

20వ కళాసుధ అవార్డుల ప్రధానం

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్బంగా మార్చి 16న విడుద‌ల

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

'వైశాఖం' చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌ తో పాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది - జయ బి

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.

సినిమా బాగా లేకపోతే.. టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం : 'సత్య గ్యాంగ్‌' నిర్మాత

సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'.

మార్చి 23న కల్యాణ్‌రామ్‌ 'ఎంఎల్‌ఎ'

టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది.