ఒకే సినిమా.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు

  • IndiaGlitz, [Friday,June 05 2020]

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్‌2 చిత్రాల‌తో వ‌రుస హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దీని త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ ఎఫ్‌3 సినిమా చేస్తాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు వ‌రుణ్ తేజ్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వుతుంద‌ట‌.

ఇంత‌కూ వ‌రుణ్ తేజ్ నటించ‌బోయే సినిమా ఏంటో తెలుసా! దీనికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు చేతులు క‌లుపుతున్నార‌ట‌. వివ‌రాల మేర‌కు డైరెక్ట‌ర్ క్రిష్‌తో వ‌రుణ్‌తేజ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న నిర్మాణంలో ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. సురేంద‌ర్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో క్రిష్‌, వ‌రుణ్ తేజ్ ఓకే చెప్పేశార‌ట‌. ఇప్పుడు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీతో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంది.

More News

డిజిట‌ల్ కోసం చేతులు క‌లుపుతున్న నిర్మాత‌లు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ పెద్ద‌లు షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు.

క్రిష్ మాటలను పవన్ వింటాడా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

హర్భజన్ సింగ్ హీరోగా 'ఫ్రెండ్ షిప్' మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ  క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం

తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే మార్గదర్శకాలు ఇవే..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో లాక్ డౌన్‌లోనూ కైంకర్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీకి చేరిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా కేసు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.