ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో సాయితేజ్ కొత్త చిత్రం...?

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో నటించిన యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సోలో బ్రతుకే సో బెటర్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నిజానిక క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ మూవీ మే 1కే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. థియేట‌ర్స్ ఓపెన్ అయితే కానీ.. ఈ సినిమా విడుద‌లపై ఓ క్లారిటీ రానుంది. దీని తర్వాత దేవాక‌ట్టా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయి తేజ్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ కరోనా ప్రభావం వల్ల సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే మేకర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఈలోపు సాయితేజ్ కొత్త సినిమాలను లైన్‌లో పెట్టుకునే ప‌నిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ఈ యువ కథానాయ‌కుడు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాను ఇద్ద‌రు నిర్మాత‌లు క‌లిసి నిర్మించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కూ ఆ ఇద్ద‌రు నిర్మాత‌లు ఎవ‌రో తెలుసా? ఒక‌రు దిల్‌రాజు, కాగా మ‌రొక‌రు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. అయితే దేవాక‌ట్టా సినిమా త‌ర్వాత ఈ సినిమా ఉంటుంద‌ట‌. అంటే ఈ సినిమా 2022లో స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.