close
Choose your channels

‘కె.జి.యఫ్‌ చాప్టర్ 2’లో ఇద్దరు స్టార్స్‌ ఎంట్రీ

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘కె.జి.యఫ్‌ చాప్టర్ 2’లో ఇద్దరు స్టార్స్‌ ఎంట్రీ

‘బాహుబలి’ పాన్‌ ఇండియా మూవీగా ఎంతటి సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత యష్‌ హీరోగా నటించిన కన్నడ చిత్రం కె.జి.యఫ్‌ చిత్రంలో మొదటి భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ కూడా పాన్‌ ఇండియా సినిమాగానే విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కె.జి.యఫ్‌ చిత్రంలో రెండో భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ సినిమాను అంచనాలకు ధీటుగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలను కూడా ఈ సినిమాలో యాడ్‌ చేశారు. ఇపటికే అధీర అనే విలన్‌ పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఇందిరాగాంధీని పోలిన మహిళా రాజకీయ నేత రమికామసేన్‌గా రవీనాటాండన్‌ నటిస్తున్నారు. ఈమెతో పాటు టాలీవుడ్‌లో విలక్షణ పాత్రలను పోషిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పిస్తున్న రావు రమేశ్‌ కూడా ఈ సినిమా యూనిట్‌తో జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌1’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన రూ.200కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో రెండో భాగం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా జూలై 30న విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌' వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఆ తేదికే కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2ను విడుదల చేసేలా యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.