పిఠాపురంలో ఘనంగా ఉగాది వేడుకలు


Send us your feedback to audioarticles@vaarta.com


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పిఠాపురం సమన్వయకర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించి, ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేశారు. వేద పండితులు, బ్రాహ్మణులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.
ఈ ఉగాది సంబరాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి పంచాంగం, ఉగాది పచ్చడి, ప్రసాదాలు అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com