సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ విజ‌య‌యాత్ర‌లో అప‌శ్రుతి

  • IndiaGlitz, [Monday,October 05 2015]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫర్ సేల్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ విజయయాత్ర ఆదివారం కాకినాడ‌లో జ‌రిగింది. థియేటర్ యాజమాన్యం ముందుగా ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అయితే ఈ విజ‌య‌యాత్ర‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాకినాడ చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద చిత్ర బృందం ఉన్న‌ కారు ఓ అభిమాని కాలుపై వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.అభిమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో హీరో సాయిధరమ్ తేజ్, డైరక్టర్ హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More News

దీపావళికి వస్తున్న 'బెంగాల్ టైగర్'

మాస్ మహరాజ రవితేజ ఎనర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్ టైగర్.సంపత్ నంది దర్శకుడు.అందాల ముద్దుగుమ్మలు తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్.

'రుద్రమదేవి' వెనకుడుగు...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

ఈసారి రకుల్ వంతు

నటనకు సంబంధించిన నవరసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు సినీ పెద్దలు.

రామ్ కి ఎంతో స్పెషల్...

కథానాయకుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో పదేళ్లు పూర్తి కానుంది.అయితే ఈ తొమ్మిదేళ్లలో ఏ సంవత్సరం జరగని విషయం ఈ సంవత్సరంలో చోటు చేసుకోనుంది రామ్ విషయంలో.

నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

'మనం'వంటి మెమరబుల్ మూవీ తరువాత నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'.ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు.