'ఉంగరాల రాంబాబు' సాంగ్ దాసరికి అంకితం - హీరో సునీల్

  • IndiaGlitz, [Sunday,June 04 2017]

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి నిర్మాత‌గా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నటిస్తున్న చిత్రం 'ఉంగరాల రాంబాబు' ఈ సినిమా మొద‌టి సాంగ్‌ హులాలాలా హులాలాలా...సాంగ్‌ను పాత్రికేయులంద‌రూ క‌లిసి విడుద‌ల చేశారు.

దాస‌రిగారితో మంచి అనుబంధం ఉండేది. ఆయ‌న న‌న్నెప్పుడూ అందాల‌రాముడు అని పిలిచేవారు. ఎప్పుడైన మాన‌సిక ధైర్యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర‌కెళ్ళి ఓ ప‌ది నిమిషాల పాటు కూర్చొంటే స‌రిపొయేది. ఆయ‌న ఈరోజు కూడా మా వేడుక‌కు హాజ‌రైన‌ట్లుగానే భావిస్తున్నాను. ఓ క‌మెడియ‌న్‌గా, హీరోగా మారిన త‌ర్వాత నా చిత్రాల్లో నా కామెడితో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ వ‌చ్చాను. అయితే ఉంగ‌రాల రాంబాబు సినిమా చేయ‌డం, ఓ అర్థ‌వంత‌మైన సినిమా చేసిన‌ట్లుగా భావిస్తున్నాను. సినిమా రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాలు ప్రేక్ష‌కులు చాలా అర్థ‌వంతంగా న‌వ్వుకుంటారు. ఇలాంటి సినిమా చేయ‌డానికి కార‌ణం నిర్మాత‌లు ప‌రుచూరి కిరిటీ, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌గారే కార‌ణం. అందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌.

ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌గారితో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నాకు, ప్ర‌కాష్‌రాజ్‌గారికి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌లాంటి స‌న్నివేశాలుంటాయి. ప్ర‌కాష్‌రాజ్‌గారి క్యారెక్ట‌రైజేష‌న్ గొప్ప‌గా ఉంటుంది. ప్ర‌తి మూడురోజుల‌కొక‌సారి సినిమాల్లోని మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. ఈ సాంగ్‌ను దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం అని హీరో సునీల్ తెలిపారు. ఈ సినిమాలో సునీల్ గారు అద్భుత‌మైన డ్యాన్స్ చేశారు. గిబ్రాన్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత ప‌రుచూరి కిరిటీ చెప్పారు.

More News

'మరకతమణి' పాటలు విడుదల

ఆది పినిశెట్టి,నిక్కి గర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా,శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్స్ పై A.R.K శరవణన్ దర్శకత్వంలో

మల్టీస్టారర్ 'శమంతకమణి' షూటింగ్ పూర్తి - డిజిటల్ పోస్టర్స్ కి అమేజింగ్ రెస్పాన్స్!

నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'శమంతకమణి'

కీర్తిసురేష్ ను చూసి భయపడుతున్నారా..

పవన్ కల్యాణ్,త్రివిక్రమ్ కాంబినేష న్ లో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వర్మ ట్విట్టర్ ను వదలిపోవడానికి నాగబాబే కారణమా?

ఎప్పుడూ తనదైన కామెంట్స్ తో,రాతలతో ఇతరులను టార్గెట్ చేసేవాళ్ళలో రాంగోపాల్ వర్మ ముందుంటారు.

జూలై 7న నేచురల్ స్టార్ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మేన్, మజ్ను, నేను లోకల్ వంటి వరస హిట్స్తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.