క్వాలిటీ కోస‌మే 'ఉంగ‌రాల రాంబాబు' లేట్‌!

  • IndiaGlitz, [Sunday,September 10 2017]

సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతోంది.

ఈ సినిమా ఇంత‌కు ముందే విడుద‌ల కావాల్సింది కానీ సినిమాను ప్రేక్ష‌కుల ముందు క్వాలిటీగా ఆవిష్క‌రించ‌డానికే లేట్ అయింద‌ట. ఈ విష‌యాన్ని చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌లో హీరో సునీల్ స్వ‌యంగా తెలిపారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో ఆదివారం ఉద‌యం జ‌రిగింది.

పోసాని కృష్ణ‌ముర‌ళీ, అలీ, శ్రీనివాస‌రెడ్డి, అదుర్స్ ర‌ఘు, స‌త్య‌, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేశ్‌, స‌ప్త‌గిరి, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌తో పాటు దాదాపు 15 మంది క‌మెడియ‌న్లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని సునీల్ కృషిని అభినందించారు. కామెడీ చేయ‌గ‌లిగిన వాడు ట్రాజెడీని, మ‌రే ఎమోష‌న్‌ని అయినా పండించ‌గ‌ల‌డ‌ని అలీ అన్నారు. ఎవ‌రికైనా జ‌యాప‌జ‌యాలు ఉంటాయ‌ని, ఈ సినిమా సునీల్‌కి మంచి బ్రేక్ అవుతుంద‌ని పోసాని చెప్పారు.

More News

అర్జున్‌రెడ్డికి చెర్రీ ట్వీట్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ చేసిన ట్వీట్ అంద‌రికీ ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నం రేపుతున్న అర్జున్ రెడ్డి గురించి రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

'వీడెవ‌డు' క‌థ ఇదేనా?

స‌చిన్ జోషి హీరోగా న‌టించిన సినిమా 'వీడెవ‌డు'. ఈ నెల 15న విడుద‌ల కానుంది. తెలుగులో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల‌ని స‌చిన్ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

రేణు కొత్త అవతారం...

రేణు దేశాయ్..ఈ పేరు తెలుగు సినీ లోకాని పరిచయం అక్కర్లేని పేరు.

'సాహో' ఇంట్రెస్టింగ్ అప్ డేట్...

బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.

అభిమానికి డార్లింగ్ కానుక...

అందరినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్రెబల్ స్టార్ ప్రభాస్.