close
Choose your channels

హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

హీరోయిన్ రష్మిక మందన్నాపై కోలీవుడ్‌కి చెందిన ఓ చిత్ర యూనిట్ గుర్రుగా ఉందని టాక్. ఎందుకంటే.. రష్మిక చేసిన పనే అందుకు కారణమని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రష్మిక తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. సినిమా లొకేషన్‌కి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక, దానిని హ్యాష్ ట్యాగ్ సుల్తాన్ అని కూడా యాడ్ చేశారు. దాంతో అభిమానులు కార్తీ తదుపరి చిత్రం టైటిల్ `సుల్తాన్` అని ఫిక్స్ అయిపోయారు.

చిత్ర యూనిట్ ప్రకటించకుండానే రష్మిక తొందరపాటుతో సినిమా టైటిల్‌ను ఇలా ప్రకటించడంపై సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ కూడా గుర్రుగా ఉంది. రష్మిక మందన్నా తెలుగులో మహేశ్ జతగా `సరిలేరునీకెవ్వరు` సినిమాలో నటిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.