'మహాసముద్రం' లో వారిద్దరేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `ఆర్.ఎక్స్ 100`తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఏడాది దాటినా కూడా ఈ స్టార్ డైరెక్టర్ తన రెండో సినిమాను స్టార్ట్ చేయలేదు. అందుకు కారణం.. ఈయనకు సినిమాలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతుండటమే. నిజానికి ఈ యువ దర్శకుడు `మహా సముద్రం`(వినపడుతున్న) పేరుతో ఓ కథను సిద్ధం చేశారు.
ఇద్దరు హీరోలుండే ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ హీరోగా చేయాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో రవితేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు అజయ్ భూపతి తన సినిమాను ఇద్దరు అప్ కమింగ్ హీరోలతో చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.
వివరాల్లోకెళ్తే.. అజయ్ భూపతి తొలి సినిమా `ఆర్.ఎక్స్ 100` హీరో కార్తికేయ, `ఫలక్ నుమాదాస్` హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్లో `మహాసముద్రం` సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్. ఇప్పటికే ఈ ఇద్దరి హీరోలకు ఫైనల్ నెరేషన్ను కూడా ఇచ్చేశాడట ఈ అజయ్ భూపతి. తన తొలి సినిమా ఆర్.ఎక్స్ 100 స్టైల్లోనే బోల్డ్గా, రస్టిక్గా ఉంటుందని సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.