'మ‌హాస‌ముద్రం' లో వారిద్ద‌రేనా?

  • IndiaGlitz, [Thursday,October 17 2019]

తొలి చిత్రం 'ఆర్.ఎక్స్ 100'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఏడాది దాటినా కూడా ఈ స్టార్ డైరెక్ట‌ర్ త‌న రెండో సినిమాను స్టార్ట్ చేయ‌లేదు. అందుకు కార‌ణం.. ఈయ‌న‌కు సినిమాల‌కు కొన్ని అడ్డంకులు ఎదుర‌వుతుండ‌ట‌మే. నిజానికి ఈ యువ ద‌ర్శ‌కుడు 'మ‌హా స‌ముద్రం'(విన‌ప‌డుతున్న‌) పేరుతో ఓ క‌థ‌ను సిద్ధం చేశారు.

ఇద్ద‌రు హీరోలుండే ఈ సినిమాను మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా చేయాల‌నుకున్నారు. అయితే చివ‌రి నిమిషంలో ర‌వితేజ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. ఆ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద గొడ‌వే జ‌రిగింది. ఇప్పుడు అజ‌య్ భూప‌తి త‌న సినిమాను ఇద్ద‌రు అప్ క‌మింగ్ హీరోల‌తో చేయ‌బోతున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. అజ‌య్ భూప‌తి తొలి సినిమా 'ఆర్.ఎక్స్ 100' హీరో కార్తికేయ‌, 'ఫ‌ల‌క్ నుమాదాస్' హీరో విశ్వ‌క్ సేన్ కాంబినేష‌న్‌లో 'మ‌హాస‌ముద్రం' సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్‌. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి హీరోల‌కు ఫైన‌ల్ నెరేష‌న్‌ను కూడా ఇచ్చేశాడ‌ట ఈ అజ‌య్ భూప‌తి. త‌న తొలి సినిమా ఆర్.ఎక్స్ 100 స్టైల్లోనే బోల్డ్‌గా, ర‌స్టిక్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. త్వ‌రలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

More News

‘షా’ మాస్టర్ ప్లాన్.. వర్కవుటయితే వాళ్లకు కష్టాలే!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేశారు. ఇదే వర్కవుట్ అయితే వాళ్ల పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' ప్రీ-రిలీజ్ ఈవెంట్

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా

బాబుకు గుండె దడ పెరిగిపోయింది: విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

రామోజీరావు ఎన్‌సైక్లోపీడియా.. మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు.

కేసీఆర్‌కు ఊహించని షాక్.. ఈ నెల 23 తర్వాత..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుమారు రెండు వారాలుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గమంటుంటే..