అపోలో ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఉపాస‌న‌

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

ఉపాస‌న కామినేని కొణిదెల‌కు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ స‌మంగా స‌మ‌యాన్ని పంచ‌గ‌ల దిట్ట ఆమె. ఆమెకు సోష‌ల్ మీడియా ఇంపార్టెన్సూ తెలుసూ. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసేవారి మ‌న‌సుల‌ను అర్థం చేసుకోవ‌డ‌మూ తెలుసు. అందుకే బిజినెస్ ఉమెన్‌గా ఆమె త‌న‌దైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.

ఇటీవ‌ల ఉపాస‌న కామినేని త‌న 65 మంది కుటుంబ‌స‌భ్యుల‌తో దుబాయ్‌కు వెళ్లారు. 2019-20కి సంబంధించిన యాక్ష‌న్ ప్లాన్‌ను సిద్ధం చేయ‌డానికి వారంద‌రితో ఆమె దుబాయ్ వెళ్లారు. ఈ కుటుంబం అపోలో లైఫ్ కుటుంబం. భార‌త‌దేశంలో అత్యుత్త‌మ ఆక్యుపేష‌నల్ హెల్త్ కేర్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌గా మంచి పేరున్న సంస్థ అపోలో లైఫ్‌. టీపీఏ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌లో, ఇందులోని ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్‌స్యూరెన్స్ టీపీఏ లిమిటెడ్ మూడో స్థానంలో ఉంది. దాదాపు 32 మిలియ‌న్ల మందికి ఇప్ప‌టిదాకా సేవ‌లు అందించింది.

అపోలో లైఫ్‌కు సంబంధించిన 2019 కార్యాచ‌ర‌ణ‌లు, ప్ర‌ణాళిక‌ల‌ను చ‌ర్చించ‌డానికే ఉపాస‌న కామినేని త‌న అపోలో లైఫ్ కుటుంబ స‌భ్యుల‌ను 65 మందిని దుబాయ్ తీసుకెళ్లారు. ఎప్పుడూ కార్యాల‌యంలో కూర్చుని ఉండేవారు ప‌నిచేసే ప్ర‌దేశంలో మార్పు వ‌స్తే మెద‌డు మ‌రింత చురుగ్గా, న‌వ్య‌మైన ఆలోచ‌న‌ల‌తో విక‌సిస్తుంద‌ని ఉపాస‌న న‌మ్మారు. అందుకే సెమినార్ల‌ను కూడా వినూత్నంగా బ‌స్సుల్లోనూ, ఎడారుల్లోనూ నిర్వహించారు. ''నా కుటుంబం, నా కంపెనీ చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 50 శాతం మంది మ‌హిళ‌లు ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సానుకూల దృక్ప‌థంతోనూ, గొప్ప విలువ‌ల‌తోనూ ప‌నిచేస్తున్నారు. మా తాత‌య్య‌గారు డా.ప్ర‌తాప్‌.సి.రెడ్డి ఆశీస్సుల‌తో 2019-20 మరింత ఆశాజ‌నకంగా, విజ‌య‌వంతంగా ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను'' అని ఉపాస‌న తెలిపారు.

స‌రికొత్త ప్ర‌దేశాల్లో ప‌ర్య‌టిస్తూ, ఒక‌రితో ఒక‌రు ఆత్మీయంగా మెలుగుతూ, మ‌రిన్ని కొత్త విష‌యాల‌ను చ‌ర్చించుకుంటూ సాగే ఇలాంటి ప‌ర్య‌ట‌నలు వృత్తిప‌రంగానూ మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌ర‌చ‌డానికి ఉపయోగ‌ప‌డుతాయ‌న‌డంలో అనుమానం లేదు.

More News

‘మహర్షి’ రిలీజ్‌కు ముందు దిల్‌రాజుకు ‘ఐటీ’ షాక్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఐటీ (ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్) అధికారులు షాకిచ్చారు.

థియేటర్ల యాజమాన్యాలకు ఊహించని షాకిచ్చిన తలసాని

కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు థియేటర్ల యాజమాన్యాలు అనుకున్నట్లుగానే టికెట్లు పెంచేశాయి.

జూన్ మొద‌టి వారంలో 'కిల్ల‌ర్' విడుద‌ల‌

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం కొలైగార‌న్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్ ఈ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించింది.

రాజ్‌తరుణ్‌తో నిత్యామీన‌న్‌

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు కె.కె.రాధామోహ‌న్ నిర్మాణంలో మ‌రో సినిమా

కుమార్తె ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన య‌ష్‌

'కె.జి.ఎఫ్‌'తో క‌న్నడ సినిమా మార్కెట్ రేంజ్‌ను నేష‌న‌ల్ వైడ్ చేసిన హీరో య‌శ్‌. ఈయ‌న ప్ర‌స్తుతం 'కె.జి.ఎఫ్' రెండో భాగంగా 'కె.జి.ఎఫ్ 2'లో ఈయ‌న హీరోయిన్ రాధిక‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.