మోదీని ప్రశ్నించిన ఉపాసన కొణిదెల!

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల తెలుగు సినీ ప్రముఖులు అసంతృప్తిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మోదీ సర్కార్‌ను తిట్టిపోస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారినే ఆహ్వానించారు. దీంతో తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాసన రియాక్షన్ ఇదీ..

ఈ వ్యవహారంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.‘డియర్ నరేంద్ర మోదీ గారు.. మేము సౌత్ ఇండియన్స్.. మీ పాలనని అభిమానిస్తూ, మీరు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాం. కానీ మీ దృష్టిలో సినీ సెలబ్రిటీస్ మరియు కల్చరల్ ఐకాన్స్ కేవలం హిందీకి మాత్రమే పరిమితమా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే ప్రశ్నిస్తున్నా.. ఇది మీకు కరెక్ట్‌గా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ఉపాసన అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఉపాసనకు ఎంతో మంది నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. అయితే చెర్రీ సతీమణి రియాక్షన్‌కు పీఎంవో నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

ప్రధాని నివాసంలో బాలీ,టాలీవుడ్ ప్రముఖులు.. ఎందుకంటే..

భారత ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్ ప్రముఖుులు కలిశారు.

ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయాను: పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన మహేశ్‌, తారక్‌, అల్లుఅర్జున్‌లతో కలసి నటించి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుందరాంగి పూజా హెగ్డే.

రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్‌ ఆవిష్కరణ

'నాన్నగారు ఓ మాట చెప్పేవారు. లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు.

అభిమానికి సూపర్ స్టార్ స్వీట్‌ వార్నింగ్‌

రజనీకాంత్‌ ఓ అభిమానికి సుతిమెత్తటి వార్నింగ్‌ను ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే..

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' బావుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు! - సాయికిరణ్ అడివి

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'