చెర్రీ ఆరోగ్యంపై ఉపాసన ట్వీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీని కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఒకేరోజు మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వరుణ్కి మాత్రం స్వల్ప లక్షణాలుండగా.. చెర్రీకి మాత్రం ఎలాంటి లక్షణాలు లేవు. కాగా.. తాజాగా చెర్రీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం తనకు నెగిటివ్ వచ్చిందని.. అయితే చెర్రీతో పాటు తను కూడా క్వారంటైన్లో ఉన్నానని వెల్లడించింది.
ఆరు బయట చెర్రీతో కలిసి కూర్చుని ఉన్న చిన్న వీడియోను షేర్ చేసిన ఉపాసన.. ‘‘ఇది కూడా వెళ్లిపోతుంది. 2021 బాగుంటుందని ఆశిస్తున్నా. మిస్టర్ సికి ఎలాంటి లక్షణాలూ లేవు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నాకు నెగిటివ్ వచ్చింది. అయితే నాకు కూడా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చెర్రీతో కలిసి హోమ్ క్వారంటైన్లో ఉన్నా. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని పోస్ట్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments