ఉయ్యాలవాడతో ఉపేంద్ర

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

'ఖైదీ నంబ‌ర్ 150'చిత్రంతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా చిరంజీవి తెర‌పై క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ కానుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో ఉపేంద్రను తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ ఉపేంద్ర వ‌ద్ద నుండి ఎటువంటి స‌మాచారం రాలేదట‌. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే మ‌రో మెగాహీరోతో ఉపేంద్ర స్క్రీన్ పంచుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.