close
Choose your channels

ఓటీటీలోకి ఉప్పెన.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసిందంటే..!

Tuesday, February 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓటీటీలోకి ఉప్పెన.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసిందంటే..!

‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు.. 21 సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీకి చెందిన డెబ్యూ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక్క వైష్ణవ్‌కే సాధ్యమైంది. అలాగే డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది.

అలాగే ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇది ఈ విషయమై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ‘ఉప్పెన’పై స్టార్ హీరోలంతా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మెగా హీరోలతో పాటు నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.