ఈ ల్యాబ్‌ను కరోనా టెస్ట్‌లకు వాడుకోండి..: మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్ర, యూపీ, కేరళ, ఢిల్లీ, తెలంగాణతో పాటు ఏపీ, బెంగాల్ సీఎంలతోనూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను నివారించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారనే దానిపై నిశితంగా చర్చించారు. ఎండలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని భావించవద్దని.. ఎండలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాలోనూ వైరస్ విజృంభిస్తోందని అనే విషయాన్ని మోదీ గుర్తు చేశారు.

ఈ ల్యాబ్‌ను వాడుకోండి!

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. మోదీకి పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్‌లోని ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్‌ఐఆర్) కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్‌గా వినియోగించుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆ ల్యాబ్‌కు ఉన్న ప్రత్యేకతలను కూడా కేసీఆర్ నిశితంగా వివరించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తే తెలంగాణలోని వారివే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడి వారివైనా ఒకే సారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే అవకాశం ఉంటుందని మోదీ దృష్టికి కేసీఆర్ తెచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించడమే కాకుండా.. పలు సూచనలు కూడా చేశారు.

సీఎస్‌ఐఆర్ గురించి..

పరిశోధనల పరంగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 79 ఏళ్లు పూర్తి అయ్యింది. కేంద్రం పరిధిలో పరిశోధనలు సాగిస్తున్న ‘సీసీఎంబీ’ మానవాళి మనుగడ కోసం ఎన్నో విజయాలు సాధించింది. ప్రకృతిలో లభించే సహజ సంపదను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు 1942 దశకంలో ఆనాటి ప్రభుత్వం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1981-82 సంవత్సరంలో సీసీఎంబీకి జాతీయస్థాయి ల్యాబ్‌రేటరీగా గుర్తింపు నిచ్చింది.

More News

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు ఇదేనా..!?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రయోగాలు మాత్రం ఇంకా ప్రపంచ దేశాలు చేస్తూనే ఉన్నాయి.

పోర్న్ సైట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ ఫొటోలు

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో దీన్ని పనికొచ్చే పనులకు కాకుండా.. ఏ మాత్రం ప్రయోజనం లేని పనులకు వాడే వారే ఎక్కువయ్యారు. ఎవరో ఒకర్ని టార్గెట్ చేయడం.. వారిని వేధించి సొమ్ము

మళ్లీ రిస్క్ చేస్తున్న రవితేజ ?

సాధారణంగా ఒక జోన‌ర్‌లో సినిమాలు చేసి.. అవి స‌క్సెస్ కాన‌ప్పుడు మన హీరోలు అలాంటి రిస్కులు చేయ‌డానికి ఆలోచిస్తారు. కానీ ర‌వితేజ అలాంటి ఆలోచ‌న‌లేవీ లేకుండా ఓకే చెప్పాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నిర్భయ పేరెంట్స్‌కు సెల్యూట్ చేస్తున్నా.. న్యాయం జరిగింది!

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున

ప్రముఖ లేడీ సింగర్‌కు కరోనా పాజిటివ్.. అసలేం జరిగింది!?

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. చైనా నుంచి ఇప్పటికే 280కు పైగా దేశాలకు పాకిన కరోనా వైరస్.. లెక్కలేనంత మందిని బలితీసుకుంటోంది.!. ఓ వైపు మరణాలు ఎక్కువవుతుండవటంతో..