వినాయక్ చేతుల మీదుగా 'శుభలేఖ+లు' రెండో వీడియో సాంగ్

  • IndiaGlitz, [Wednesday,August 15 2018]

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిల్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘‘శుభలేఖ+లు’’. ఈ మూవీ టైటిల్ నుంచి.. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘శృంగారాలహరీ శృతజన శుభకరీ సౌందర్యలహరీ’ అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగే ఈ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు కెఎమ్ రాధాకృష్ణ సంగీతం ఓ హైలెట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియో సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాటిని ఈ పాట రెట్టింపు చేసింది.

చాలా ఇన్నోవేటివ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘శుభలేఖ+లు’’చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది.

సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కథ- మాటలు : జనార్ధన్- విస్సు, సంగీతం : కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ : మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్ : మధు, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. సూర్యనారాయణ, నిర్మాతలు : సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శరత్ నర్వాడే.

More News

సుధీర్ బాబు, మెహ్రీన్ జంట‌గా రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్ లో మొద‌లు కానుంది.

మాస్+ యాక్ష‌న్ = 'అర‌వింద స‌మేత' టీజ‌ర్‌

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? ....

జ‌య‌ప్ర‌ద‌గా..జ‌య‌సుధ‌గా..

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రో రెండు భాష‌ల్లోకి జ‌గ్గూభాయ్ ఎంట్రీ...

హీరోగా కంటే విల‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి, యాత్ర‌, అర‌వింద స‌మేత‌, ఎన్‌.జి.కె చిత్రాల‌తో పాటు ఉత్త‌రాదిన స‌ల్మాన్‌ఖాన్ 'ద‌బాంగ్ 3'లో

ప‌వ‌న్ సినిమా రీమేక్‌లో...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అత్తారింటికి దారేది' . 2013లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లికింది.