2 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ త్వరలోనే.. తప్పనిసరి అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్

  • IndiaGlitz, [Thursday,June 24 2021]

కరోనాని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అందుకే దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణి వేగంగా జరుగుతోంది. పలు సంస్థలు తయారు చేస్తున్న టీకాలు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్ళు వయసు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నారు

ఇదిలా ఉండగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోంది పిల్లలే. ఈ నేపథ్యంలో 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు టీకా ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి నెలకొంది. దీనితో తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు తక్కువగానే కనిపిస్తాయి. కానీ వారి వల్ల వైరల్ వ్యాప్తి చెందుతోంది.

అందువల్ల కరోనాని అరికట్టాలంటే పిల్లలకు కూడా టీకా తప్పనిసరి. ప్రస్తుతం రెండేళ్లు పైబడిన చిన్నారులకు టీకా క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. భారత్ బయోటెక్ తో పాటు మరికొన్ని సంస్థలు చిన్నారులకు టీకా తయారు చేస్తున్నాయి. చిన్నారుల టీకాపై రెండు, మూడోదశల ప్రయోగాల వివరాలు సెప్టెంబర్ లో వస్తాయి.

ఆ తర్వాత అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో చిన్నారులకు టీకా అందుబాటులోకి వస్తుంది అని గులేరియా అన్నారు. భారత్ బయోటెక్ సంస్థ చిన్నారుల టీకాలో కాస్త ముందంజలో ఉంది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం 6 నుంచి 12 ఏళ్ళు గల వారికి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆ తర్వాతే రెండేళ్ల పైబడిన వారికి ట్రయల్స్ నిర్వహిస్తారు.

More News

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

నాపై ఒత్తిడి చేస్తున్నారు.. విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితపై నటి హేమ పోటీ!

'మా' అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే ఎన్నికల హీట్ టాలీవుడ్ లో మొదలైపోయింది.

రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

తమ అభిమాన తారల కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం.

హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన 'సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు 'వరుడు కావలెను‘, 'నరుడి బ్రతుకు నటన'

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా

ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కైన జ్యోతిష్కుడు.. రూ.17 కోట్ల నకిలీ దందా!

తన ఇంట్లో పెద్ద చోరీ జరిగిపోయినట్లు బిల్డప్ ఇచ్చిన జ్యోతిష్కుడు అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు.