క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్‌..!!

  • IndiaGlitz, [Friday,August 14 2020]

ఒక వైపు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాణంలో చురుకుగా ఉండే వ్య‌క్తుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఒక‌రు. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల త‌ర్వాత క్రిష్ త‌దుప‌రి సినిమాను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ప్రారంభ‌మైన‌ వారం రోజుల్లోనే క‌రోనా ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో సినిమా షూటింగ్‌ల‌ను ఆపేశారు. దీంతో క్రిష్ ప్ర‌స్తుతం ఖాలీగా ఉన్నారు. ప‌వ‌న్ క్రిష్ సినిమా లొకేష‌న్స్‌లోకి రావాలంటే.. ముందు వ‌కీల్‌సాబ్‌ను పూర్తి చేసి రావాల్సి ఉంటుంది. దీనికి సమ‌యం ప‌ట్టేలానే ఉంది. న‌వంబ‌ర్ నెల‌లో ప‌వ‌న్‌, క్రిష్ సినిమా స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఈలోపు.. క్రిష్ ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్, రాజీవ్ రెడ్డితో క‌లిసి కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఎప్ప‌టిలా క్రిష్ నిర్మాణంలో భాగ‌మ‌వుతున్నారు. వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ న‌టిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ట‌. న‌ల‌బై రోజుల్లో సినిమాను పూర్తి చేసేలా ఇప్ప‌టికే జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లాన్ చేసుకున్నార‌ని అక్టోబ‌ర్‌లో సినిమా విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకున్నార‌ని టాక్‌.