నిర్మాత‌గా మారుతున్న వైష్టో కృష్ణ‌..

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

పూరి జ‌గ‌న్నాథ్ నిర్మించిన చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ‌ర్క్ చేసిన వైష్టో కృష్ణ ఇప్పుడు నిర్మాత‌గా మారుతున్నారు. పూరి ద‌గ్గ‌ర చాలా సంవ‌త్స‌రాలు వ‌ర్క్ చేసిన కృష్ణ ఆత‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసారు. ఇప్పుడు నిర్మాతగా త‌న అదృష్టాన్నిప‌రీక్షించుకోబోతున్నారు. సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా వైష్టో కృష్ణ ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి బి.వి.ఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

పూరి ద‌గ్గ‌ర చాలా సినిమాల‌కు రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన బి.వి.ఎస్ ర‌వి వాంటెడ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు. కానీ విజ‌యం మాత్రం సాధించ‌లేక‌పోయాడు. ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌ని డిఫ‌రెంట్ స్ర్కిప్ట్ రెడీ చేసాడ‌ట‌. క‌థ బాగా న‌చ్చ‌డంతో సాయిధ‌ర‌మ్ తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ చిత్రంలో తేజు స‌ర‌స‌న కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ ఫేం మెహ‌రీన్ న‌టిస్తుంది. మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ కూడా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.

More News

'బద్రి'కి 16 ఏళ్లు

'బద్రి' ఈ పేరు చెబితే మ‌న‌కు మూడు విష‌యాలు గుర్తుకు వ‌స్తాయి. అందులో మొద‌టిది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రెండోది డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఇక మూడోది నువ్వు నందా అయితే, నేను బ‌ద్రి, బ‌ద్రినాథ్ అయితే ఏంటి..?

బాలయ్య సెంచరీ సినిమా ప్రారంభోత్సవం కు భారీ ఏర్పాట్లు..

నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమాను ఉగాది రోజున అమరావతిలో ప్రకటించిన విషయం తెలిసిందే.గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

స‌రైనోడు ర‌న్ టైమ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. బ‌న్ని స‌ర‌స‌న కేధ‌రిన్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించారు.

స్టైలీష్ ఫిల్మ్ స‌రైనోడు - అల్లు అర‌వింద్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

మరోసారి నోరు జారిన బాలయ్య....

నందమూరి నటసింహం బాలయ్య సావిత్రి ఆడియో ఫంక్షన్లో అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి..కడుపు అయినా చేయాలి...అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.