‘వ‌కీల్‌సాబ్’ ట్రీట్ సిద్ధ‌మ‌వుతోందా?

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రో ప‌క్క రీసెంట్‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను స్టార్ట్ చేసినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. కరోనా పరిస్థితులు చక్కబడితే కానీ..వకీల్‌సాబ్ సినిమా స్టార్ట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. అయితే ప‌వ‌న్ అభిమానులు మాత్రం ట్రీట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కూ వారి ట్రీట్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

త‌మ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ఈ సంద‌ర్భంగా వారు త‌మ హీరో రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌సాబ్‌’ నుండి ఏదేనా అప్‌డేట్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అభిమానుల ఆశల‌ను అర్థం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, నిర్మాత‌లు బోనీ క‌పూర్‌, దిల్‌రాజు ‘వకీల్‌సాబ్‌’ టీజ‌ర్‌ను క‌ట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

More News

తెలంగాణకు భారీ ఆఫర్.. రూ.1200 కోట్ల పెట్టుబడికి మెడ్ ట్రానిక్స్ సిద్ధం

మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది.

సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. కరోనా పరీక్ష నిర్వహించగా..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి నిర్వహించిన పరీక్షల్లో

బీరుట్ ఘటన ఎఫెక్ట్.. భాగ్యనగర వాసుల్లో టెన్షన్ టెన్షన్..

హైదరాబాద్‌కు అమ్మోనియా నైట్రేట్ టెన్షన్ పట్టుకుంది. కీసర మండలం అంకిరెడ్డి పల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి.

‘నిశ్శ‌బ్దం’ రిలీజ్‌ విష‌యంలో  ప్రేక్ష‌కుల రెస్పాన్స్

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’.

ఓల్డేజ్... పూరి ఇచ్చిన స‌ల‌హా

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొన్ని విషయాలను తన అభిప్రాయాలను చెబుతూ వీడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.